కడప జిల్లాలో కొర్రపాడు, రాజుపాలెం, చిన్నశెట్టి పల్లె, అరకటవేముల, పొట్టిపాడు, పర్లపాడు, పగిడాల గ్రామాల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు రహదారుల వెంట ఉండే పచ్చని అందాలకు ముగ్ధులవుతున్నారు. ఏ సమయంలో వెళ్లినా చల్లటి వాతావరణం ఉండటంతో సంతోషంగా ప్రయాణిస్తున్నారు. రాజుపాలెం మండలమంతా 44 వేల ఎకరాల్లో రైతులు పంట సాగు చేస్తున్నారు. శనగ, పత్తి, జొన్న, కంది పంటలు పండిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో రహదారి చుట్టూ కనుచూపుమేర పచ్చదనం పరుచుకోవటంతో రైతులు, అటువైపు వెళ్లే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి...ప్రకృతి సేద్యం... ప్రజలకు అమృతం..!