బకాయిలు చెల్లించాలని కడప జిల్లా రాజంపేట విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు కాంట్రాక్టు ఉద్యోగులు నిరసనకు దిగారు. ఈ ఏడాది మే నెలలో ఒడిశాలో వచ్చిన వరదల సమయంలో తమ సేవలను ఉపయోగించుకుని..వాటికి సంబంధించి ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదని కార్మికులు ఆరోపించారు. కార్మికులకు రావాల్సిన రూ.10 లక్షల బిల్లుల ప్రతిపాధనలను ఉన్నతాధికారులకు పంపామని, వారు ఆమోదం తెలిపిన వెంటనే చెల్లింపులు చేస్తామని ఏడీఈ తెలిపారు.
ఇదీ చూడండి : ఉద్ధృతంగా కుందు...ఆందోళనలో గ్రామస్థులు