కడప జిల్లా ప్రొద్దుటూరులో రక్షక్ వాహనం డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న ఎఆర్ కానిస్టేబుల్ సాల్ల శ్రీనివాసుల రెడ్డి (ARPC 2363)(A+ve) కు ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో 14 రోజులపాటు చికిత్స తీసుకుని పూర్తి స్థాయిలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లో చేరాడు. పోలీసు శాఖలో సేవలు అందించి పదవీ విరమణ పొందిన ప్రొద్దుటూరుకు చెందిన ఎస్ఐ రామకృష్ణ కరోనాతో ప్రాణాపాయస్థితిలో ఉన్నారని తెలిసింది. జిల్లా ఎస్పీ పిలుపు మేరకు సాల్ల శ్రీనివాసుల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా అందజేశారు. దీంతో రిటైర్డ్ పోలీసు అధికారికి ఊపిరిపోసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. జిల్లాలోని పోలీసు అధికారులు, తోటి పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనివాసులురెడ్డిని అభినందించారు. జిల్లా ఎస్పీ నగదు రివార్డుతో సత్కరించారు.
![ఏ.ఏర్ కానిస్టేబుల్ పలువురుకి ఆదర్శం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8270247_387_8270247_1596380433134.png)