ETV Bharat / state

రోళ్లమడుగు వద్ద మినీలారీ బోల్తా.. 14 మందికి గాయాలు

author img

By

Published : Sep 11, 2020, 10:19 AM IST

Updated : Sep 11, 2020, 12:11 PM IST

కడప జిల్లా రాజంపేట మండలం రోళ్లమడుగు వద్ద మినీలారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 14 మందికి గాయాలు కాగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి తన వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు.

Minilorry roll over at Rollamadugu
రోళ్లమడుగు వద్ద మినీలారీ బోల్తా

టెంపు బోల్తా పడిన సంఘటనలో 14 మందికి తీవ్రగాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం రాయచోటి మార్గంలోని రోళ్లమడుగు ప్రాంతంలో జరిగింది. పెనగలూరు మండలం సింగనమల, కంబాలకుంట గ్రామాలకు చెందిన కూలీలు సుండుపల్లెలో మామిడికాయలను కోయడానికి టెంపోలో బయలుదేరారు. రోళ్లమడుగు ప్రాంతంలో టెంపో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 14 మంది గాయపడ్డారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి వారందరినీ దగ్గరుండి తన వాహనంలో, 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

టెంపు బోల్తా పడిన సంఘటనలో 14 మందికి తీవ్రగాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట మండలం రాయచోటి మార్గంలోని రోళ్లమడుగు ప్రాంతంలో జరిగింది. పెనగలూరు మండలం సింగనమల, కంబాలకుంట గ్రామాలకు చెందిన కూలీలు సుండుపల్లెలో మామిడికాయలను కోయడానికి టెంపోలో బయలుదేరారు. రోళ్లమడుగు ప్రాంతంలో టెంపో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 14 మంది గాయపడ్డారు. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి వారందరినీ దగ్గరుండి తన వాహనంలో, 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి. కరోనా భయంతో కంటి ఆస్పత్రుల్లో కానరాని రోగులు

Last Updated : Sep 11, 2020, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.