ETV Bharat / state

'విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను ఆదుకుంటాం' - Kadapa District SP Office News

పోలీసులు విధులతో పాటు ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఇటీవల కాలంలో వివిధ రకాల కారణాలతో మృతి చెందిన పోలీసుల.. కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు.

'విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను ఆదుకుంటాం'
'విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను ఆదుకుంటాం'
author img

By

Published : Mar 23, 2021, 6:46 PM IST

విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కడప ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఎస్పీ అన్బురాజన్ రూ.2 లక్షల చొప్పున రూ. 8 లక్షలు అందజేశారు.

పోలీసులు విధులతో పాటు తమ ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలని సూచించారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది.. తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా.. వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కోరారు.

విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కడప ఎస్పీ అన్బురాజన్ స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఎస్పీ అన్బురాజన్ రూ.2 లక్షల చొప్పున రూ. 8 లక్షలు అందజేశారు.

పోలీసులు విధులతో పాటు తమ ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలని సూచించారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పోలీసు సిబ్బంది.. తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్యలున్నా.. వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కోరారు.

ఇవీ చదవండి:

ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.