ETV Bharat / state

'రెండు వేర్వేరు కేసుల్లో పది మంది అరెస్ట్'

author img

By

Published : Apr 25, 2021, 7:52 PM IST

రెండు వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న పది మందిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నుంచి 4 లక్షల రూపాయల నగదు, 4.50 లక్షలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

కడప పోలీసులు రెండు వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న పది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని అదనపు ఎస్పీ దేవప్రసాద్ మీడియా ఎదుట హాజరుపర్చారు. కడపలోని ఓం శాంతి నగర్​కు చెందిన ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వంశీకృష్ణ అనే దొంగను అరెస్టు చేయగా అతని నుంచి 4.50లక్షలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కడప చిన్న పోలీస్​స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 4 లక్షల నగదు, 7 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

కడప పోలీసులు రెండు వేర్వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న పది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని అదనపు ఎస్పీ దేవప్రసాద్ మీడియా ఎదుట హాజరుపర్చారు. కడపలోని ఓం శాంతి నగర్​కు చెందిన ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వంశీకృష్ణ అనే దొంగను అరెస్టు చేయగా అతని నుంచి 4.50లక్షలు విలువ చేసే బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. కడప చిన్న పోలీస్​స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 4 లక్షల నగదు, 7 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: 'కరోనా బాధితులకు వైద్య చికిత్సలు సక్రమంగా అందుతున్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.