చేనేత కార్మికులు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వైఎస్సార్ నేతన్న నేస్తం చేనేత ఉప వృత్తుల వారికి కూడా అమలు చేయాలని చేనేత ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ మల్లికార్జున్ డిమాండ్ చేశారు. నూలు వడికే వారు, రాట్నం తిప్పేవారు, రంగులు అద్దేవారు కూడా చేనేత కార్మికులేనని ఆయన తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ చేనేత కార్మికుల బతుకులు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీచూడండి. వైకాపా - తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. 11 మందికి గాయాలు