కొందరు వ్యక్తులు పేలుడు పదార్థాలు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న కడప పోలీసులు.. పోరుమామిళ్ల దగ్గర దాడులు చేశారు. 275 జిలెటెన్ స్టిక్స్, 375 మీటర్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు - కాశీనాయన రహదారుల్లో చేసిన ఈ తనిఖీల్లో.. ఓ ద్విచక్రవాహనాన్ని సోదా చేయగా నిందితులు పట్టుబడ్డారు. రామ్నాయక్, నాగరాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి...