ETV Bharat / state

వీరభద్రుని నైవేద్య ఘట్టం.. భక్తులకు మహా ప్రసాదం..! - కడపలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు

ఏ గుడిలోనైనా దేవుని నైవేద్యం అంటే కాస్తంత చేతిలో పెడతారు. కానీ ఆ ఆలయంలో ఓ చోట రాశిగా పోస్తారు. ఈ ప్రసాదాన్ని అందుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటీ పడతారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి కూడా నైవేద్యం కోసం తరలివస్తారు. మరి ఆ ప్రసాద మహత్తు ఏంటో.. ఆ ఆలయం ఎక్కడ ఉందో మనమూ చూసేద్దామా..!

During the Brahmotsavas of the Veerabhadraswamy Temple in the Raichoti district of Kadapa district
పరమేశ్వరుని నైవేద్యం.. భక్తులకు మహా ప్రసాదం
author img

By

Published : Feb 27, 2020, 10:42 PM IST

వీరభద్రుని నైవేద్య ఘట్టం.. భక్తులకు మహా ప్రసాదం

కడప జిల్లా రాయచోటిలో వెలసిన వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా నైవేద్య ఘట్టం వైభవంగా జరిగింది. స్వామి వారి ప్రధాన ఆలయంలో వీరశైవులు వండిన మహా నైవేద్యాన్ని రాశిగా పోశారు. ఒడియా రాజులు నైవేద్యాన్ని పొందిన తర్వాత.. విభూతి రుద్రాక్ష మాలలు ధరించిన భక్తులు మహా నైవేద్యాన్ని పొందేందుకు భారీగా దూసుకొచ్చారు. హర హర మహాదేవ అంటూ భక్తి పారవశ్యంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టంగా కొనసాగుతూ వస్తున్న ఈ సన్నివేశాన్ని తిలకించి... స్వామివారి ప్రసాదాన్ని పొందేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

నైవేద్య నేపథ్యం...

పరమశివుని జటాజూటం నుంచి ఉద్భవించిన ప్రళయకాల వీరభద్రుడు.. త్రినేత్రుడు భక్తులకు దర్శనమిచ్చాడు. అమ్మవారు స్వామి ఉగ్రరూపాన్ని అనునయిస్తూ దుర్గాదేవిగా ఆలయంలో అవతరించింది. ఉగ్రరూపంతో ఊగిపోతున్న ప్రళయ రుద్రుణ్ని శాంతించడానికి అప్పట్లో భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద పంచాన్న భోజనాలతో మహా నైవేద్యం రాశి పోశారు. స్వామి తన మూడో కన్నుతో మహా నైవేద్యం స్వీకరించి శాంతించారు. అప్పటి నుంచి ఆనవాయితీగా.. బ్రహ్మోత్సవాల్లో మహా నైవేద్య ఘట్టం కొనసాగుతోంది.

ఇదీ చదవండి:నూక తాత జాతర... ఆ పాదం తాకితే నిజమైన సంబరం...

వీరభద్రుని నైవేద్య ఘట్టం.. భక్తులకు మహా ప్రసాదం

కడప జిల్లా రాయచోటిలో వెలసిన వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా నైవేద్య ఘట్టం వైభవంగా జరిగింది. స్వామి వారి ప్రధాన ఆలయంలో వీరశైవులు వండిన మహా నైవేద్యాన్ని రాశిగా పోశారు. ఒడియా రాజులు నైవేద్యాన్ని పొందిన తర్వాత.. విభూతి రుద్రాక్ష మాలలు ధరించిన భక్తులు మహా నైవేద్యాన్ని పొందేందుకు భారీగా దూసుకొచ్చారు. హర హర మహాదేవ అంటూ భక్తి పారవశ్యంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులను అదుపు చేసేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టంగా కొనసాగుతూ వస్తున్న ఈ సన్నివేశాన్ని తిలకించి... స్వామివారి ప్రసాదాన్ని పొందేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

నైవేద్య నేపథ్యం...

పరమశివుని జటాజూటం నుంచి ఉద్భవించిన ప్రళయకాల వీరభద్రుడు.. త్రినేత్రుడు భక్తులకు దర్శనమిచ్చాడు. అమ్మవారు స్వామి ఉగ్రరూపాన్ని అనునయిస్తూ దుర్గాదేవిగా ఆలయంలో అవతరించింది. ఉగ్రరూపంతో ఊగిపోతున్న ప్రళయ రుద్రుణ్ని శాంతించడానికి అప్పట్లో భక్తులు ఆలయ ప్రధాన ద్వారం వద్ద పంచాన్న భోజనాలతో మహా నైవేద్యం రాశి పోశారు. స్వామి తన మూడో కన్నుతో మహా నైవేద్యం స్వీకరించి శాంతించారు. అప్పటి నుంచి ఆనవాయితీగా.. బ్రహ్మోత్సవాల్లో మహా నైవేద్య ఘట్టం కొనసాగుతోంది.

ఇదీ చదవండి:నూక తాత జాతర... ఆ పాదం తాకితే నిజమైన సంబరం...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.