ETV Bharat / state

viveka murder case: వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని ప్రశ్నిస్తున్న అధికారులు - viveka murder case latest updates

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. 57వ రోజు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని ప్రశ్నిస్తున్న అధికారులు
వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని ప్రశ్నిస్తున్న అధికారులు
author img

By

Published : Aug 2, 2021, 8:46 PM IST

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 57వ రోజు కొనసాగుతోంది. రెండు బృందాలు పులివెందులకు వెళ్లి విచారిస్తున్నారు. సోమవారం రాత్రి పులివెందుల ఆర్​అండ్​బి అతిథి గృహం చేరుకున్న సీబీఐ బృందం.. డ్రైవర్ దస్తగిరిని విచారణకు పిలిచారు. దాదాపు గంటకు పైగా హత్య కేసుకు సంబంధించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతకుముందు సాయంత్రం మరో బృందం వివేకా ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించింది.

వివేకా ఇంటి నుంచి సమీపంలోని ఆటో మొబైల్ దుకాణం వరకు సీబీఐ అధికారులు కొలతలు తీసుకున్నారు. వివేకా ఇంటి రోడ్డు మార్గంలో ఇరువైపులా ఉన్న కొలతలను ఆటో మొబైల్ దుకాణం ప్రహరీ గోడను.. దాని ఎత్తును పరిశీలించి సర్వేయర్ ద్వారా కొలతలు వేసి రికార్డును నమోదు చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఈ ప్రాంతం నుంచి దుండగులు ఏమైనా వెళ్ళారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక బృందం పులివెందుల నుంచి కడపకు రాగానే.. మరో బృందం కడప నుంచి పులివెందుల చేరుకొని అనుమానితులను విచారిస్తున్నారు.

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 57వ రోజు కొనసాగుతోంది. రెండు బృందాలు పులివెందులకు వెళ్లి విచారిస్తున్నారు. సోమవారం రాత్రి పులివెందుల ఆర్​అండ్​బి అతిథి గృహం చేరుకున్న సీబీఐ బృందం.. డ్రైవర్ దస్తగిరిని విచారణకు పిలిచారు. దాదాపు గంటకు పైగా హత్య కేసుకు సంబంధించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతకుముందు సాయంత్రం మరో బృందం వివేకా ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించింది.

వివేకా ఇంటి నుంచి సమీపంలోని ఆటో మొబైల్ దుకాణం వరకు సీబీఐ అధికారులు కొలతలు తీసుకున్నారు. వివేకా ఇంటి రోడ్డు మార్గంలో ఇరువైపులా ఉన్న కొలతలను ఆటో మొబైల్ దుకాణం ప్రహరీ గోడను.. దాని ఎత్తును పరిశీలించి సర్వేయర్ ద్వారా కొలతలు వేసి రికార్డును నమోదు చేసుకున్నారు. హత్య జరిగిన రోజు ఈ ప్రాంతం నుంచి దుండగులు ఏమైనా వెళ్ళారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక బృందం పులివెందుల నుంచి కడపకు రాగానే.. మరో బృందం కడప నుంచి పులివెందుల చేరుకొని అనుమానితులను విచారిస్తున్నారు.

ఇదీ చదవండి:

GRMB: రేపు గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.