ETV Bharat / state

విషాదం: కరోనాతో ఒకేరోజు అన్నదమ్ములు మృతి

author img

By

Published : Apr 30, 2021, 8:40 PM IST

ఆ అన్నదమ్ములపై కరోనా పగ బట్టింది. ఒకే రోజు ఇద్దరిని కబళించింది. కొవిడ్​తో ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విశాఖ జిల్లా బాలారాం గ్రామంలో జరిగింది. మరోవైపు కరోనా కారణంగా కడప జిల్లా బద్వేలులో ఇద్దరు మృతి చెందారు.

brothers-death-with-corona-in-balaram-vizag-district
కరోనాతో ఒకే రోజు అన్నదమ్ములు మృతి

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బాలారం గ్రామానికి చెందిన అప్పన్న శ్రీరాములు, అప్పన్న రమణాజీ అన్నాదమ్ముళ్లు. వీరు కరోనాతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆకస్మికంగా పల్స్ పడిపోవడంతో శ్రీరాములు మృతిచెందారు. మృతుడు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికయ్యారు. శ్రీరాములు తమ్ముడు రమణాజీ విశాఖ కేజీహెచ్​లో కరోనాతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు కరోనాతో చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

కడప జిల్లా బద్వేలులో కరోనా లక్షణాలతో మొబైల్ షాప్ యజమాని సుబ్బయ్య, ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ మృతిచెందారు. కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బాలారం గ్రామానికి చెందిన అప్పన్న శ్రీరాములు, అప్పన్న రమణాజీ అన్నాదమ్ముళ్లు. వీరు కరోనాతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆకస్మికంగా పల్స్ పడిపోవడంతో శ్రీరాములు మృతిచెందారు. మృతుడు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా ఎన్నికయ్యారు. శ్రీరాములు తమ్ముడు రమణాజీ విశాఖ కేజీహెచ్​లో కరోనాతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే రోజు కరోనాతో చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

కడప జిల్లా బద్వేలులో కరోనా లక్షణాలతో మొబైల్ షాప్ యజమాని సుబ్బయ్య, ఇంజినీరింగ్ విద్యార్థి ప్రవీణ్ మృతిచెందారు. కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ... మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదీచదవండి.

'రాజధాని రైతులపై పెట్టిన అక్రమ కేసులు కోర్టులో నిలబడవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.