ETV Bharat / state

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

author img

By

Published : Aug 16, 2020, 5:08 PM IST

పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

West Godavari district Collector R Muthyala Raju
West Godavari district Collector R Muthyala Raju

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పరిశీలించారు. ఇప్పటికే భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పోలవరంలో బలహీనంగా ఉన్న నెక్లెస్ బండ్​ను కలెక్టర్ పరిశీలించారు.

వరద తాకిడికి గట్టు బలహీనపడకుండా బండరాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం మండలం కొత్తూరు, తల్లవరం గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఏజెన్సీ గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు పరిశీలించారు. ఇప్పటికే భద్రాచలంలో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పోలవరంలో బలహీనంగా ఉన్న నెక్లెస్ బండ్​ను కలెక్టర్ పరిశీలించారు.

వరద తాకిడికి గట్టు బలహీనపడకుండా బండరాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పోలవరం మండలం కొత్తూరు, తల్లవరం గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఏజెన్సీ గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి

విశాఖ రెల్లివీధిలో వ్యక్తి తల కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.