ETV Bharat / state

పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు..గ్రామస్థులకు చిక్కాడు - ఏలూరు జిల్లా వార్తలు

పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ దొంగ గ్రామస్థులకు దొరికిపోయాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం తంగెళ్ళమూడి గ్రామంలో చోటు చేసుకుంది.

west godavari district
పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న దొంగ వీళ్లకి దోరికిపోయాడు
author img

By

Published : Aug 4, 2020, 11:55 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం తంగెళ్ళమూడి గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న ఓ వ్యక్తిని అనుమానంతో గ్రామస్థులు కట్టిపడేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద వ్యక్తి వివరాలు ఆరా తీశారు. కృష్ణాజిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన దొంగగా దర్యాప్తులో వెల్లడైంది. గన్నవరం ప్రాంతానికి చెందిన సతీష్​గా పోలీసులు గుర్తించారు. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న సతీష్ కోసం గత కొద్ది రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. యాధృచ్ఛికంగా సతీష్​పై గ్రామస్థులకు అనుమానం రావడంతో దొంగ పోలీసులకు దొరికిపోయాడు.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం తంగెళ్ళమూడి గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న ఓ వ్యక్తిని అనుమానంతో గ్రామస్థులు కట్టిపడేశారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద వ్యక్తి వివరాలు ఆరా తీశారు. కృష్ణాజిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన దొంగగా దర్యాప్తులో వెల్లడైంది. గన్నవరం ప్రాంతానికి చెందిన సతీష్​గా పోలీసులు గుర్తించారు. పలు దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న సతీష్ కోసం గత కొద్ది రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. యాధృచ్ఛికంగా సతీష్​పై గ్రామస్థులకు అనుమానం రావడంతో దొంగ పోలీసులకు దొరికిపోయాడు.

ఇదీ చదవండి గాలివానకు కూలిన దేవాలయ ధ్వజస్తంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.