ETV Bharat / state

వాట్సాప్ స్టేటస్... యువకుడి ప్రాణం తీసింది - వాట్సప్ స్టేటస్ వల్ల వ్యక్తి ఆత్మహత్య

వాట్సాప్ స్టేటస్ ఓ నిండు ప్రాణాన్ని తీసింది. అప్పు తిరిగివ్వలేదని.. ఫొటోను వాట్సప్ స్టేటస్​లో పెట్టాడో వ్యక్తి. అది అవమానంగా భావించిన అప్పు తీసుకున్న వ్యక్తి... పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పు తిరిగివ్వడానికి సమయం అగిడినా... తనను వేధించారని, తన చావుకు వారే కారణమని సెల్ఫీ వీడియో తీసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

person committed suicide because of whats app status in west godavari
వాట్సప్ స్టేటస్... ప్రాణం తీసింది
author img

By

Published : Jan 31, 2020, 10:54 AM IST

యువకుని సెల్ఫీ వీడియో

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో.. వాట్సాప్ స్టేటస్ ఓ యువకుడి ప్రాణం తీసింది. నల్లజర్లకు చెందిన ఓ వ్యక్తి తన ఫోటోను వాట్సాప్​లో పెట్టి వేధిస్తున్నాడని మనస్తాపంతో గోపవరానికి చెందిన గౌరు శ్రీను అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోడానికి కారణాన్ని ముందుగా సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.

ఆత్మహత్యకు ముందు గౌరు శ్రీను సెల్ఫీ వీడియో...

"నేనెవరినీ మోసం చేయలేదు...మోసం చేయాలని నాకు లేదు. డబ్బులు సమయానికి ఇవ్వలేకపోయాను. కానీ ఇస్తానని చెప్పాను. గత మూడు రోజులుగా వాట్సాప్​ స్టేటస్​లో నా ఫోటోలు పెట్టి నన్ను వేధించారు. నేనేదో దొంగతనం చేసి పారిపోయినట్లు.. ఓ దొంగలాగా నన్ను చిత్రీకరించాడు మెంతులపల్లి దుర్గాప్రసాద్, అతని కుటుంబం. వాళ్లందరూ డబ్బులు కోసం నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు . నేను ఇవ్వనని చెప్పట్లేదు.. ఇస్తానని చెప్పాను. టైం అడుగుతున్నాను, కానీ వాళ్లు చాలా ఇదిగా హింసిస్తున్నారు. నా చావుకు కారణం మెంతులపల్లి దుర్గాప్రసాద్, అతని కుటుంబసభ్యులు" అని సెల్ఫీ వీడియో తీసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇదీ చదవండి:

కత్తులతో పొడిచి దారుణ హత్య

యువకుని సెల్ఫీ వీడియో

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో.. వాట్సాప్ స్టేటస్ ఓ యువకుడి ప్రాణం తీసింది. నల్లజర్లకు చెందిన ఓ వ్యక్తి తన ఫోటోను వాట్సాప్​లో పెట్టి వేధిస్తున్నాడని మనస్తాపంతో గోపవరానికి చెందిన గౌరు శ్రీను అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోడానికి కారణాన్ని ముందుగా సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.

ఆత్మహత్యకు ముందు గౌరు శ్రీను సెల్ఫీ వీడియో...

"నేనెవరినీ మోసం చేయలేదు...మోసం చేయాలని నాకు లేదు. డబ్బులు సమయానికి ఇవ్వలేకపోయాను. కానీ ఇస్తానని చెప్పాను. గత మూడు రోజులుగా వాట్సాప్​ స్టేటస్​లో నా ఫోటోలు పెట్టి నన్ను వేధించారు. నేనేదో దొంగతనం చేసి పారిపోయినట్లు.. ఓ దొంగలాగా నన్ను చిత్రీకరించాడు మెంతులపల్లి దుర్గాప్రసాద్, అతని కుటుంబం. వాళ్లందరూ డబ్బులు కోసం నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు . నేను ఇవ్వనని చెప్పట్లేదు.. ఇస్తానని చెప్పాను. టైం అడుగుతున్నాను, కానీ వాళ్లు చాలా ఇదిగా హింసిస్తున్నారు. నా చావుకు కారణం మెంతులపల్లి దుర్గాప్రసాద్, అతని కుటుంబసభ్యులు" అని సెల్ఫీ వీడియో తీసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఇదీ చదవండి:

కత్తులతో పొడిచి దారుణ హత్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.