పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలోని పేద కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 150 రూపాయల విలువైన సంచిని ప్రతి కుటుంబానికి అందజేశారు. గ్రామంలోని సుమారు 2,500 కుటుంబాలకు పంపిణీ చేశారు. ప్రస్తుత సమయంలో పేదవారిని ఆదుకునేందుకు తనవంతు సాయంగా ఈ కార్యక్రమం చేసినట్లు రాధాకృష్ణ పేర్కొన్నారు.
![ex mla radhakrishna distributed vegetables to poor in velpuru village](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-tpg-15-25-ex-mla-distributed-vegetables-to-poor-av-ap10092_25042020190537_2504f_1587821737_920.jpg)