ETV Bharat / state

ముంపు బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: బండారు - narsapuram ex mla latest news

నరసాపురం మండలంలోని కొత్త, పాత నవరసపురం గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పర్యటించారు. ముంపునకు గురైన గ్రామాల్లోని బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. వరద నీరు తగ్గేవరకు బాధితులకు భోజన సదుపాయం కల్పించాలన్నారు.

ex mla bandaru madhav naidu visits flood areas of narasapuram mandal
నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు
author img

By

Published : Aug 20, 2020, 9:47 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మండలంలోని కొత్త పాత నవరసపురం గ్రామాల్లో పర్యటించారు. ముంపు బాధితులను పరామర్శించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మూడు రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను పరామర్శించేందుకు అధికార పార్టీ నేతలు రాకపోవడం దారుణమన్నారు.

బాధితులకు కనీసం తాగేందుకు మంచినీరు కూడా సరఫరా చేయకపోవడం సరి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటమునిగిన గ్రామ ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్​ చేశారు. పంట నష్టపోయిన రైతుల్ని పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మండలంలోని కొత్త పాత నవరసపురం గ్రామాల్లో పర్యటించారు. ముంపు బాధితులను పరామర్శించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మూడు రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను పరామర్శించేందుకు అధికార పార్టీ నేతలు రాకపోవడం దారుణమన్నారు.

బాధితులకు కనీసం తాగేందుకు మంచినీరు కూడా సరఫరా చేయకపోవడం సరి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటమునిగిన గ్రామ ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్​ చేశారు. పంట నష్టపోయిన రైతుల్ని పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్నారు.

ఇదీ చదవండి:

వరద ముంపునకు గురైన వారిని ఆదుకోండి: జ్యోతుల నెహ్రూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.