రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ ఆర్థిక చేయూతనివ్వడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సున్నా వడ్డీ పథకం కింద కోటి 11 లక్షల 30 వేల రూపాయల విలువైన చెక్కులను సంఘం ప్రతినిధులకు అందజేశారు. మహిళా సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఇళ్లకు పరిమితమవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
ఇవీ చదవండి.. 'ఏపీ మత్స్యకారులను సహాయ శిబిరాలకు తరలించండి'