పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వారంరోజులుగా నమోదవుతూనే ఉన్నాయి. జిల్లాలో కొత్తగా 6 పాజిటివ్ కేసులు గుర్తించారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 158కి చేరింది. తాడేపల్లిగూడెం, ఆచంట, ఏలూరులో ఒక్కోకేసు నమోదుకాగా.. నరసాపురంలో రెండు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ నమోదైంది. జిల్లాలో పదికంటే అధికంగా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ పరిధిని 200 మీటర్ల నుంచి 500 మీటర్లకు పెంచనున్నారు. ఆచంట మండలం చెరుకువాడ, పెనుగొండ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో క్లస్టర్ పరిధిని పెంచారు. తాడేపల్లిగూడెం అర్బన్, ఏలూరు అర్బన్ , ఆర్ ఆర్ పేట ప్రాంతాల్లో 14 రోజులుగా కేసులు నమోదుకాకపోవడం వల్ల.. బఫర్ జోన్ ను తొలగించి.. కేవలం కంటైన్మెంట్ క్లస్టర్ ను కొనసాగిస్తున్నారు.
జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 158కి చేరింది. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ పరిధిని 200 మీటర్ల నుంచి 500 మీటర్లకు పెంచనున్నారు.
![జిల్లాలో కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదు corona positive cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7457370-869-7457370-1591174474221.jpg?imwidth=3840)
పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వారంరోజులుగా నమోదవుతూనే ఉన్నాయి. జిల్లాలో కొత్తగా 6 పాజిటివ్ కేసులు గుర్తించారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 158కి చేరింది. తాడేపల్లిగూడెం, ఆచంట, ఏలూరులో ఒక్కోకేసు నమోదుకాగా.. నరసాపురంలో రెండు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ నమోదైంది. జిల్లాలో పదికంటే అధికంగా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ పరిధిని 200 మీటర్ల నుంచి 500 మీటర్లకు పెంచనున్నారు. ఆచంట మండలం చెరుకువాడ, పెనుగొండ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో క్లస్టర్ పరిధిని పెంచారు. తాడేపల్లిగూడెం అర్బన్, ఏలూరు అర్బన్ , ఆర్ ఆర్ పేట ప్రాంతాల్లో 14 రోజులుగా కేసులు నమోదుకాకపోవడం వల్ల.. బఫర్ జోన్ ను తొలగించి.. కేవలం కంటైన్మెంట్ క్లస్టర్ ను కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి: 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం