పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద శుక్రవారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. మన్యం మెట్ట ప్రాంతాల్లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఇద్దరికీ రాపిడ్ పరీక్షలు నిర్వహించగా.. కరోనా నిర్ధరణ అయింది. బాధితులను ఏలూరు కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల వ్యవధిలో సరిహద్దులో ఐదు కరోనా కేసులు నమోదు కావడం పోలీసులు, వైద్య సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే సరిహద్దుల్లో కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
ఇవీ చూడండి...