పశ్చిమ గోదావరి జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం తెల్లవారుజాము నుంచి ప్రజలు భోగి మంటలు వేశారు. పోతునూరూ గ్రామంలో గ్రామ డీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి ప్రారంభించారు. గంగిరెద్దుల విన్యాసాలు, యువకుల నృత్యాలు, భోగి మంటలు, డప్పు వాయిద్యాలు కళారూపాలతో అత్యంత ఆకర్షణీయంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ శేషగిరి, ఎంపీడీవో లక్ష్మీ, ఈఓపీఆర్డీ సురేష్ పలువురు గ్రామ ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆనందం వనాన్ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రారంభించారు.
ఇవీ చూడండి...: ఉభయగోదావరి జిల్లాల్లో కోళ్ల పందేలకు జోరుగా ఏర్పాట్లు