ETV Bharat / state

'ఆరోపణలు.. వైద్యుల మనోధైర్యం దెబ్బతీసే చర్యలు'

author img

By

Published : Jul 27, 2020, 2:12 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు రాష్ట్రంలో సమర్ధంగా చేపడుతున్నా ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆయనకు ఏ విషయంలోనూ అవగాహన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా కరోనా పరీక్షలు చేస్తున్నామని మంత్రి అన్నారు.

alla nani on corona cases in andhra pradesh
కరోనాపై మంత్రి ఆళ్ల నాని
కరోనాపై మంత్రి ఆళ్ల నాని

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు సమర్ధంగా చేపడుతున్నా ప్రతిపక్షనేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ ఆళ్ల నాని విమర్శించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై చేస్తున్న బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యల కారణంగా వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని మంత్రి అన్నారు. కరోనాకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఏ విషయంపైనా చంద్రబాబుకు అవగాహన లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉన్నా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడా లోటు లేకుండా చూస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. తెదేపా అధికారంలో ఉండగా 5 వేల వైద్యుల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా బాగు చేయలేదని అన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు సైతం నిలిపివేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టారని.. వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.300 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు.

కరోనా చికిత్సల కోసం రూ.350 కోట్లు ఖర్చవుతోందని మంత్రి తెలిపారు. కోలుకున్న వారినుంచి ప్లాస్మా సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఐఎంఏ, వైద్యులు కూడా కరోనా చికిత్సలకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. కరోనాతో మృతిచెందిన వారి దహన సంస్కారాలను అడ్డుకోవద్దని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గత 6 నెలలుగా 17 వేలమంది వైద్య నిపుణులను నియమించినట్లు వెల్లిడించారు. కరోనా పరీక్షల కోసం 20 ల్యాబ్‌లను అందుబాటులో ఉంచామన్నారు.

ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సకు నిరాకరిస్తే చర్యలు తీసుకున్నామని ఆళ్ల నాని తెలిపారు. చికిత్సకు అధిక ధరలు వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు ఆస్పత్రిలో ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'అంత్యక్రియలను అడ్డుకోవద్దు- అది మన సంస్కృతి కాదు'

కరోనాపై మంత్రి ఆళ్ల నాని

రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలు సమర్ధంగా చేపడుతున్నా ప్రతిపక్షనేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ ఆళ్ల నాని విమర్శించారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బందిపై చేస్తున్న బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యల కారణంగా వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందని మంత్రి అన్నారు. కరోనాకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఏ విషయంపైనా చంద్రబాబుకు అవగాహన లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి ఇబ్బంది కరంగా ఉన్నా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడా లోటు లేకుండా చూస్తోందని మంత్రి చెప్పుకొచ్చారు. తెదేపా అధికారంలో ఉండగా 5 వేల వైద్యుల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా బాగు చేయలేదని అన్నారు. ఆరోగ్యశ్రీ నిధులు సైతం నిలిపివేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టారని.. వైకాపా ప్రభుత్వం వచ్చాక రూ.300 కోట్ల బకాయిలు చెల్లించామని అన్నారు.

కరోనా చికిత్సల కోసం రూ.350 కోట్లు ఖర్చవుతోందని మంత్రి తెలిపారు. కోలుకున్న వారినుంచి ప్లాస్మా సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఐఎంఏ, వైద్యులు కూడా కరోనా చికిత్సలకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. కరోనాతో మృతిచెందిన వారి దహన సంస్కారాలను అడ్డుకోవద్దని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు. కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గత 6 నెలలుగా 17 వేలమంది వైద్య నిపుణులను నియమించినట్లు వెల్లిడించారు. కరోనా పరీక్షల కోసం 20 ల్యాబ్‌లను అందుబాటులో ఉంచామన్నారు.

ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సకు నిరాకరిస్తే చర్యలు తీసుకున్నామని ఆళ్ల నాని తెలిపారు. చికిత్సకు అధిక ధరలు వసూలుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు ఆస్పత్రిలో ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'అంత్యక్రియలను అడ్డుకోవద్దు- అది మన సంస్కృతి కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.