ETV Bharat / state

ఉండ్రాజవరంలో పదో తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం - get to gather in undrajavaram school

ఉండ్రాజవరం శ్రీమతి మల్లిన వెంకటనర్సమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981- 82 లో ఆ విద్యార్థుల పదో తరగతి పూర్తైంది. 38 ఏళ్ల తర్వాత అదే విద్యాలయంలో వారు కలుసుకుని.. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం... చదువులమ్మ చెట్టు నీడలో అంటూ అప్పటి మధుర స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

undrajavaram
ఉండ్రాజవరంలో 1981- 82 టెన్త్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
author img

By

Published : Feb 23, 2020, 9:13 PM IST

ఉండ్రాజవరంలో 1981- 82 టెన్త్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని శ్రీమతి మల్లిన వెంకటనర్సమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981- 82 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా సాగింది. సుమారు 80 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకరికొకరు చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పుకుంటూ మురిసిపోయారు. పాఠ్యాంశాలు బోధించిన గురువులతో మమేకమై ఆనందంలో తేలిపోయారు. కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు.

ఇవీ చూడండి:

అబ్బబ్బ ఎంత ఎంత ముద్దుగున్నారే...!

ఉండ్రాజవరంలో 1981- 82 టెన్త్ బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని శ్రీమతి మల్లిన వెంకటనర్సమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981- 82 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా సాగింది. సుమారు 80 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకరికొకరు చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పుకుంటూ మురిసిపోయారు. పాఠ్యాంశాలు బోధించిన గురువులతో మమేకమై ఆనందంలో తేలిపోయారు. కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు.

ఇవీ చూడండి:

అబ్బబ్బ ఎంత ఎంత ముద్దుగున్నారే...!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.