విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంత్రి బొత్స సత్యనారాయణ నూతన తహసీల్దార్, ఉపఖజానా కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పింఛన్లు నిలిపివేసిన వాళ్లలో అర్హులైనవారికి కచ్చితంగా పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి 3 రాజధానులు అవసరం ఉందని పునరుద్ఘాటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చంద్రబాబుకు పట్టదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనగోలులో అవకతవకలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. దళారీలు రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: అక్కరకు రాని కొనుగోలు కేంద్రాలు... రైతులకు మిగులుతోంది కన్నీళ్లు...