ETV Bharat / state

చెత్త నిర్వహణకు వినూత్న పంథా.. హోం కంపోస్టు కార్యక్రమానికి శ్రీకారం

author img

By

Published : Jun 22, 2021, 8:57 AM IST

రసాయనాలు, పురుగు మందుల అవశేషాలు లేని కూరగాయలు, ఆకుకూరలు.. తాజా పండ్లు, సువాసనలు వెదజల్లే పూలమొక్కలు...ఆకుపచ్చని చెట్లతో ఆకట్టుకునే ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇవీ ఇప్పుడు విజయనగరంలోని ఇళ్లల్లో కనిపిస్తున్న దృశ్యాలు. చెత్త సమస్యను చక్కదిద్దేందుకు నగరపాలక సంస్థ చేపట్టిన వినూత్న కార్యక్రమమే ఇంటి పెరడు, మిద్దెసాగు. ఇంటిలో లభించే చెత్తతోనే సేంద్రీయ ఎరువుల తయారీ చేయించి వాటి ద్వారా మిద్దెసాగును ప్రోత్సహిస్తోంది.

vijayanagaram home compost news
vijayanagaram home compost news
చెత్త నిర్వహణలో విజయనగరం నగరపాలక సంస్థ వినూత్న పంథా

చెత్త నిర్వహణకు విజయనగరం నగరపాలక సంస్థ వినూత్న పంథాను ఎంచుకుంది. పెరుగుతున్న జనాభాకు తోడు.. వేగంగా విస్తరిస్తున్న నగరీకరణతో చెత్త నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. నిత్యం నగరంలో 1.25 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగవతుండగా...వాటిలో 48 టన్నులు తడి చెత్తే ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా నగరపాలక సంస్థ "హోం కంపోస్టు" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంట్లోనే తడి చెత్తతో సేంద్రీయ ఎరువును తయారు చేసుకుని మొక్కలకు వినియోగించేలా మహిళలను ప్రోత్సహించింది. ఇందులో భాగంగా అధికారులు ఇంటికి రెండు చొప్పున ప్లాస్టిక్ డ్రమ్ములను ఉచితంగా అందించారు. సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలో నగర దీపికలతో అవగాహన కల్పించారు. ఈ ఎరువుతో సొంతంగా మిద్దెసాగు, ఇంటి పెరడును మహిళలు అందంగా తీర్చిదిద్దుకున్నారు .

తాజా కూరగాలు, ఆకుకూరలతోపాటు, పండ్లు ఇంటిపైనే లభిస్తుండటంతో.. చాలామంది వీటి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతున్నాయంటున్నారు. నగరపాలక సంస్థకు చెందిన నగరదీపికలు ప్రతివారం ఇంటింటికి వెళ్లి హోం కంపోస్టు తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా మిద్దెసాగు, పెరటి తోటల పెంపకంపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మొక్కల ఎంపిక, ఎరువులు, చీడపీడల నివారణపై మహిళలకు అవగాహన కల్పించడంతో.. నగరంలో పెద్దఎత్తున మిద్దెసాగుకు ముందుకొచ్చారు. -ఎస్.ఎస్. వర్మ, నగరపాలక సంస్థ కమిషనర్

సంకల్ప బలం ఉంటే... చెత్త నిర్వహణ, దాని నుంచి సంపద సృష్టి సాధ్యమేనని విజయనగరం నగరపాలక సంస్థ అధికారులు నిరూపిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా.. మరో 15శాతం కుటుంబాలను హోం కంపోస్టు విధానం దిశగా మళ్లించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇదీ చదవండి: Farmers Protest: విత్తన సరఫరాలో జాప్యం..అన్నదాతల నిరసనలు

చెత్త నిర్వహణలో విజయనగరం నగరపాలక సంస్థ వినూత్న పంథా

చెత్త నిర్వహణకు విజయనగరం నగరపాలక సంస్థ వినూత్న పంథాను ఎంచుకుంది. పెరుగుతున్న జనాభాకు తోడు.. వేగంగా విస్తరిస్తున్న నగరీకరణతో చెత్త నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. నిత్యం నగరంలో 1.25 మెట్రిక్‌ టన్నుల చెత్త పోగవతుండగా...వాటిలో 48 టన్నులు తడి చెత్తే ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా నగరపాలక సంస్థ "హోం కంపోస్టు" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంట్లోనే తడి చెత్తతో సేంద్రీయ ఎరువును తయారు చేసుకుని మొక్కలకు వినియోగించేలా మహిళలను ప్రోత్సహించింది. ఇందులో భాగంగా అధికారులు ఇంటికి రెండు చొప్పున ప్లాస్టిక్ డ్రమ్ములను ఉచితంగా అందించారు. సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలో నగర దీపికలతో అవగాహన కల్పించారు. ఈ ఎరువుతో సొంతంగా మిద్దెసాగు, ఇంటి పెరడును మహిళలు అందంగా తీర్చిదిద్దుకున్నారు .

తాజా కూరగాలు, ఆకుకూరలతోపాటు, పండ్లు ఇంటిపైనే లభిస్తుండటంతో.. చాలామంది వీటి పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన కూరగాయలు దొరుకుతున్నాయంటున్నారు. నగరపాలక సంస్థకు చెందిన నగరదీపికలు ప్రతివారం ఇంటింటికి వెళ్లి హోం కంపోస్టు తయారీపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా మిద్దెసాగు, పెరటి తోటల పెంపకంపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మొక్కల ఎంపిక, ఎరువులు, చీడపీడల నివారణపై మహిళలకు అవగాహన కల్పించడంతో.. నగరంలో పెద్దఎత్తున మిద్దెసాగుకు ముందుకొచ్చారు. -ఎస్.ఎస్. వర్మ, నగరపాలక సంస్థ కమిషనర్

సంకల్ప బలం ఉంటే... చెత్త నిర్వహణ, దాని నుంచి సంపద సృష్టి సాధ్యమేనని విజయనగరం నగరపాలక సంస్థ అధికారులు నిరూపిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా.. మరో 15శాతం కుటుంబాలను హోం కంపోస్టు విధానం దిశగా మళ్లించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇదీ చదవండి: Farmers Protest: విత్తన సరఫరాలో జాప్యం..అన్నదాతల నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.