విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం మూల బొడ్డవర గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన గిరిజన ఉన్నత పాఠశాల విద్యార్థి కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పరామర్శించారు. విద్యార్థి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సొంతంగా 25 వేల రూపాయలు ఆది సాయం అందించారు. అనంతరం ఎస్ కోటలోని గిరిజన ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన పాఠశాలలో సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు. బడ్జెట్లో గిరిజన విద్యకు అధిక నిధులు కేటాయించామన్నారు.
ఇదీ చదవండి :