ETV Bharat / state

'మాది మహిళలకు చేయూతనిచ్చే ప్రభుత్వం' - సున్నా వడ్డీ చెక్కులు పంపిణీ చేసిన పాముల పుష్ప శ్రీవాణి

వైకాపా ప్రభుత్వం మహిళలకు చేయూతనిచ్చే ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తోందన్నారు.

'మాది మహిళలకు చేయూతనిచ్చే ప్రభుత్వం'
'మాది మహిళలకు చేయూతనిచ్చే ప్రభుత్వం'
author img

By

Published : Apr 24, 2020, 7:20 PM IST

విజయనగరం జిల్లాకు సంబంధించి మంజూరైన 33.9 కోట్ల రూపాయల వైఎస్​ఆర్ సున్నా వడ్డీ పథకం చెక్కులను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మహిళా సంఘాలకు అందజేశారు. 11 కోట్ల రూపాయల వైఎస్ఆర్ బీమా చెక్కులను పంపిణీ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని పుష్ప శ్రీవాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా... వైఎస్​ఆర్ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 90.37లక్షల మంది మహిళలకు మేలు జరుగుతుందని ఉపముఖ్యమంత్రి తెలియచేశారు.

విజయనగరం జిల్లాకు సంబంధించి మంజూరైన 33.9 కోట్ల రూపాయల వైఎస్​ఆర్ సున్నా వడ్డీ పథకం చెక్కులను ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మహిళా సంఘాలకు అందజేశారు. 11 కోట్ల రూపాయల వైఎస్ఆర్ బీమా చెక్కులను పంపిణీ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారని పుష్ప శ్రీవాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా... వైఎస్​ఆర్ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తుందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 90.37లక్షల మంది మహిళలకు మేలు జరుగుతుందని ఉపముఖ్యమంత్రి తెలియచేశారు.

ఇదీ చదవండి: సంస్కరణల్లో భాగమే.. కొత్త ఎస్​ఈసీ నియామకం: ప్రభుత్వం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.