ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీలకు చెందిన జెండాల రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికారుల తీరు మారడం లేధు. విజయనగరం జిల్లా ద్వారపూడిలో రైతు భరోసా కేంద్రానికి వైకాపా జెండాను పోలిన రంగులు వేయటం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయంపై వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు ఆశాదేవిని వివరణ అడగ్గా... రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలకు ఇవే రంగులు వేస్తున్నారని చెప్పారు. వైకాపా జెండా రంగులకు.. వీటికి తేడా ఉందన్నారు.
ఇవీ చూడండి: