ETV Bharat / state

'మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి' - collector hari jawaharlal news

ప్రపంచ మత్స్యకారులు వారి మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకోవటానికి... రిజిస్ట్రేషన్ చేసిన మార్కెటింగ్ సొసైటీ పత్రాలను మత్స్యకార సంఘాలకు విజయనగరం జిల్లా పాలనాధికారి హరి జవహర్ లాల్ అందజేశారు. ఆక్వా బజారుకు సంబంధించిన మత్స్యకార మార్కెటింగ్‌ సొసైటీ నమోదు పత్రంతో పాటు బైలాను సంఘ సభ్యులకు అందజేశారు. మత్స్యకారులకు మంచి రోజులు వచ్చినట్లేనని కలెక్టర్ అన్నారు.

collector Hari Jawaharlal handed over the Registered Marketing Society documents to the fishermen's associations to market their fishery
మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి: కలెక్టర్ హరిజవహర్ లాల్
author img

By

Published : Nov 22, 2020, 9:50 AM IST

collector Hari Jawaharlal handed over the Registered Marketing Society documents to the fishermen's associations to market their fishery
పత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తదితరులు

మత్స్యకారులు వారి మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకునేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా నమోదు చేసిన సొసైటీ పత్రాలను ఆయా సంఘాలకు జిల్లా పాలనాధికారి హరిజవహర్‌లాల్‌ అందజేశారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు ఫిషింగ్‌ హార్బర్లు, 25 ఆక్వా హబ్‌ల పనులను దూరదృశ్య సమావేశం ద్వారా ప్రారంభించారు. విజయనగరం నుంచి కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌, శాసనమండలి సభ్యుడు పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యే అప్పలనాయుడు, సంయుక్త కలెక్టర్‌ జీసీ కిశోర్‌కుమార్‌, జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆక్వా బజారుకు సంబంధించిన మత్స్యకార మార్కెటింగ్‌ సొసైటీ నమోదు పత్రంతో పాటు బైలాను సంఘ సభ్యులకు అందజేశారు. ప్రతి జిల్లాకు ఒక ఆక్వా మార్కెటింగ్‌ సొసైటీని ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు మార్కెటింగు సౌకర్యం, గిట్టుబాటు ధరలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున రాష్ట్రంలోనే విజయనగరం తొలి సొసైటీగా ఏర్పడిందని కలెక్టర్‌ తెలిపారు. దీంతో మత్స్యకారులకు మంచి రోజులు వచ్చినట్లేనని చెప్పారు. 62 మంది మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేశారు. వీరికి బ్యాంకుల ద్వారా మంజూరు చేసిన రూ.13.5 లక్షల రుణానికి సంబంధించిన పాస్‌ పుస్తకాలను అందించారు.

ఇదీ చదవండి:

25 నుంచి తమిళనాడుకు ఏపీఎస్​ఆర్టీసీ బస్సులు

collector Hari Jawaharlal handed over the Registered Marketing Society documents to the fishermen's associations to market their fishery
పత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తదితరులు

మత్స్యకారులు వారి మత్స్య సంపదను మార్కెటింగ్ చేసుకునేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా నమోదు చేసిన సొసైటీ పత్రాలను ఆయా సంఘాలకు జిల్లా పాలనాధికారి హరిజవహర్‌లాల్‌ అందజేశారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు ఫిషింగ్‌ హార్బర్లు, 25 ఆక్వా హబ్‌ల పనులను దూరదృశ్య సమావేశం ద్వారా ప్రారంభించారు. విజయనగరం నుంచి కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌, శాసనమండలి సభ్యుడు పెనుమత్స సురేష్‌బాబు, ఎమ్మెల్యే అప్పలనాయుడు, సంయుక్త కలెక్టర్‌ జీసీ కిశోర్‌కుమార్‌, జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆక్వా బజారుకు సంబంధించిన మత్స్యకార మార్కెటింగ్‌ సొసైటీ నమోదు పత్రంతో పాటు బైలాను సంఘ సభ్యులకు అందజేశారు. ప్రతి జిల్లాకు ఒక ఆక్వా మార్కెటింగ్‌ సొసైటీని ఏర్పాటు చేసి ఆక్వా రైతులకు మార్కెటింగు సౌకర్యం, గిట్టుబాటు ధరలను కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున రాష్ట్రంలోనే విజయనగరం తొలి సొసైటీగా ఏర్పడిందని కలెక్టర్‌ తెలిపారు. దీంతో మత్స్యకారులకు మంచి రోజులు వచ్చినట్లేనని చెప్పారు. 62 మంది మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందజేశారు. వీరికి బ్యాంకుల ద్వారా మంజూరు చేసిన రూ.13.5 లక్షల రుణానికి సంబంధించిన పాస్‌ పుస్తకాలను అందించారు.

ఇదీ చదవండి:

25 నుంచి తమిళనాడుకు ఏపీఎస్​ఆర్టీసీ బస్సులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.