విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చొడమ్మ అగ్రహారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు బాలికలపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం రేపింది. ఆ చిన్నారుల్లో ఎనిమిదేళ్ల వయసున్న ఒకరు అంధురాలు, మరో చిన్నారికి మూడేళ్ల వయస్సు.
అదే గ్రామానికి చెందిన బాలుడు పదో తరగతి చదువుతున్నాడు. గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో మాయమాటలు చెప్పి సమీపం గృహంలో తీసుకెళ్లి ఇద్దరు బాలికలపై అత్యాచారం చేసేందుకు ఆ బాలుడు ప్రయత్నించాడు.
చిన్నారులు ఇద్దరు గట్టిగా అరవడంతో గ్రామస్ధులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థిని పోలీసులకు అప్పగించారు. తాను చేసిన తప్పును అంగీకరించిన బాలుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలాజీరావు తెలిపారు.
ఇదీ చదవండి మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య