ETV Bharat / state

కరోనా సోకిందని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Apr 30, 2021, 6:06 AM IST

కరోనా సోకిందని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పాజిటివ్ వచ్చిందని తెలియటంతో పొలంలో ఉపయోగించే విషగుళికులు మింగి ఆత్మహత్యయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామునాయుడు మృతి చెందాడు.

suicide
కరోనా సోకిందని వ్యక్తి ఆత్మహత్య

విజయనగరం జిల్లాలో కరోనా సోకిందిని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శృంగవరపుకోట మండలం కొట్టాం గ్రామానికి చెందిన చింతల రామునాయుడు గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. ఈ నెల 25న శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్ వచ్చిందని గ్రామ ఏఎన్ఎం ఫోన్ చేసి చెప్పగా.. మనస్తాపానికి గురైన రామునాయుడు పొలంలోని వెళ్లి విషగుళికలు మింగాడు. తర్వాత ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో విషయం చెప్పగా.. అప్రమత్తమైన వారు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామునాయుడు మృతి చెందాడు.

విజయనగరం జిల్లాలో కరోనా సోకిందిని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శృంగవరపుకోట మండలం కొట్టాం గ్రామానికి చెందిన చింతల రామునాయుడు గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్నాడు. ఈ నెల 25న శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్ వచ్చిందని గ్రామ ఏఎన్ఎం ఫోన్ చేసి చెప్పగా.. మనస్తాపానికి గురైన రామునాయుడు పొలంలోని వెళ్లి విషగుళికలు మింగాడు. తర్వాత ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో విషయం చెప్పగా.. అప్రమత్తమైన వారు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామునాయుడు మృతి చెందాడు.

ఇదీ చదవండి

కుటుంబాన్ని బలి తీసుకున్న అధిక రుణాలు.. అవమాన భారం..

ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.