ETV Bharat / state

పోలీసులకు అప్పగించేందుకే తీసుకెళ్తున్నాం: కిడ్నాపర్లు

విశాఖలో యువకుడి కడ్నాప్​ కేసులో నిందితులను తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద పోలీసులు పట్టుకున్నారు. రాజేష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. నిందితులపై అపహరణ కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

author img

By

Published : Nov 12, 2020, 3:00 PM IST

Kidnappers arrested
యువకుడిని కిడ్నాప్ చేసిన నిందితులు అరెస్టు

విశాఖలో యువకుడి కిడ్నాప్ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. పిచ్చారావు, కుమార్, తరుణ్, ప్రసాద్, వెంకటేష్, శంకర్, శ్రీరాములు.. రాజేష్ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో రాజేష్ మోసాలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. గుంటూరులో శ్రీరాములు రాజేష్​పై ఫిర్యాదు చేసిన బాధితులు ఉన్నారని కిడ్నాపర్లు పేర్కొన్నారు. రాజేష్​ను పోలీసులకు అప్పగించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అయితే నిందితులపై అపహరణ కేసు నమోదు చేసి రిమాండ్ రు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

విశాఖలో యువకుడి కిడ్నాప్ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. పిచ్చారావు, కుమార్, తరుణ్, ప్రసాద్, వెంకటేష్, శంకర్, శ్రీరాములు.. రాజేష్ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తూర్పుగోదావరి జిల్లా కడియం వద్ద కిడ్నాపర్లను పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో రాజేష్ మోసాలకు పాల్పడినట్లు నిందితులు వెల్లడించారు. గుంటూరులో శ్రీరాములు రాజేష్​పై ఫిర్యాదు చేసిన బాధితులు ఉన్నారని కిడ్నాపర్లు పేర్కొన్నారు. రాజేష్​ను పోలీసులకు అప్పగించేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అయితే నిందితులపై అపహరణ కేసు నమోదు చేసి రిమాండ్ రు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి...

జంతు ప్రదర్శనశాలల్లో కల్పించాల్సిన వసతుల పై సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.