విశాఖ జిల్లా పాడేరు లోచలిపుట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన నూకరత్నం ఐటీడీఐ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య లక్ష్మీ ఆరుబయట చింతపండు ఎండ పెడుతుండగా..అదుపుతప్పి జీపు ఆమె పైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయం కావటంతో ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కాగా మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉండగా..ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఇదీచదవండి