విశాఖ జిల్లా తాళ్లపాలెం పోలవరం ఎడమ కాలువలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలి వద్దనున్న గుర్తింపు కార్డుల ఆధారంగా రాజేంద్రపాలెం పీహెచ్సీలో పనిచేస్తున్న వైద్యాధికారిణి శ్యామలగా గుర్తించారు. ఆమెను హత్య చేసి ఎవరైనా కాలువలో పడేసారా లేక ఆత్మహత్యా? అన్న కోణంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఆమె రెండేళ్ల నుంచి రాజేంద్రపాలెం పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోవడం వల్ల అక్కబావల దగ్గర ఉంటున్నట్లు పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. ఈమె భర్త విజయవాడలో ఉన్నారు. ఓ కుమార్తె కూడా ఉంది. ప్రమాదం జరిగిన కారు ఇంకా లభ్యం కాలేదని అనకాపల్లి పట్టణ సీఐ భాస్కర్ రావు తెలిపారు.
ఇదీ చదవండి :