డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగిన మావోయిస్టు వారోత్సవాలకు గిరిజనులు సహకరించలేదని... విశాఖ జిల్లా ఎస్పీ బాబూజీ వివరించారు. తమకు అభివృద్ధి కావాలని.. మావోయిస్టు అగ్రనేతలతో గిరిజనులు తేల్చి చెప్పినట్లు ఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో అమాయక గిరిజనులను బలి తీసుకోవడంపై... వ్యతిరేకత ఏర్పడిందని తెలిపారు. గిరిజనులు మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేశారన్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: కన్నప్రేమ కావాలి... పెంచిన ఆప్యాయత ఉండాలి..!