ఎమ్మెల్సీ ఇంటిపై వైకాపా శ్రేణుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే - tdp mla fires on ysrcp at anakapalli
తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఇంటిపై వైకాపా శ్రేణులు దాడి చేయడంపై అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ మండిపడ్డారు. వైకాపా నాయకులు రౌడీయిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరగలేదన్నారు.
వైకాపాపై అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ
By
Published : Jan 24, 2020, 12:50 PM IST
వైకాపాపై అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ ధ్వజం
Intro:Ap_vsp_46_24_mlc_intini_parisilinchina_maji_mla_ab_AP10077_k.Bhanojirao_8008574722 ఇళ్ల మీదకు వచ్చి దౌర్జన్యం చేయడం అనకాపల్లి చరిత్రలో ఎప్పుడూ లేదని ఇక్కడ కడప సంస్కృతిని తీసుకువస్తున్నారని అందరూ భయపడేటట్లు వైకాపా నాయకులు రౌడీయిజం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గోవింద సత్యనారాయణ తెలిపారు అనకాపల్లి లో ని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఇంటిని వైకాపా శ్రేణులు ముట్టడించాన్ని ఆయన ఖండించారు
Body:గత ఐదేళ్లలో అనకాపల్లి నియోజకవర్గంలో ఒక్క గొడవ జరగలేదని అందరూ కలిసి ఒక కుటుంబంలా ఉంటారని గుర్తు చేశాడు జగన్ పాలన అంటేనే భయపడుతున్నారు అని తెలిపారు గతంలో జగన్ తల్లి విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తే కడప సంస్కృతి వస్తుందని ఓటర్లు తిరస్కరించారని రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి రావడంతో కడప సంస్కృతిని విశాఖ తీసుకు వచ్చారని పేర్కొన్నారు
Conclusion:ఎమ్మెల్సీ ఇంటి పై దౌర్జన్యం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు