కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళం తొలగించడంపై తెదేపా నేతలు మండిపడ్డారు. 2018 డిసెంబర్ 27వ తేదీన గత ప్రభుత్వం ఉక్కు కర్మాగారం కోసం ఏర్పాటుచేసిన పైలాన్ను ఈ ప్రభుత్వం తొలగించడం దుర్మార్గపు చర్య అని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు లింగా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉంచిన ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళాన్ని పరిశీలించారు. నాలుగు రోజుల్లో సున్నపురాళ్లపల్లె వద్ద వాటిని పునర్నిర్మించాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలులో పెట్టాలి: రామకృష్ణ