ETV Bharat / state

'ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళాన్ని పునర్నిర్మించాలి' - జమ్మలమడుగులో తెదేపా ధర్నా

ఉక్కు కర్మాగారం కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన పైలాన్​ను తొలగించడం దుర్మార్గమని కడపజిల్లా తెదేపా అధ్యక్షుడు లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల్లో వాటిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

tdp  leaders protest at kadapa
జమ్మలమడుగులో తెదేపా ధర్నా
author img

By

Published : Jan 3, 2021, 3:30 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళం తొలగించడంపై తెదేపా నేతలు మండిపడ్డారు. 2018 డిసెంబర్ 27వ తేదీన గత ప్రభుత్వం ఉక్కు కర్మాగారం కోసం ఏర్పాటుచేసిన పైలాన్​ను ఈ ప్రభుత్వం తొలగించడం దుర్మార్గపు చర్య అని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు లింగా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉంచిన ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళాన్ని పరిశీలించారు. నాలుగు రోజుల్లో సున్నపురాళ్లపల్లె వద్ద వాటిని పునర్నిర్మించాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలో ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళం తొలగించడంపై తెదేపా నేతలు మండిపడ్డారు. 2018 డిసెంబర్ 27వ తేదీన గత ప్రభుత్వం ఉక్కు కర్మాగారం కోసం ఏర్పాటుచేసిన పైలాన్​ను ఈ ప్రభుత్వం తొలగించడం దుర్మార్గపు చర్య అని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు లింగా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఉంచిన ఉక్కు పైలాన్, గ్రానైట్ గోళాన్ని పరిశీలించారు. నాలుగు రోజుల్లో సున్నపురాళ్లపల్లె వద్ద వాటిని పునర్నిర్మించాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కర్నూలులో పెట్టాలి: రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.