భారత నౌకాదళానికి చెందిన ఎంపీ జబీర్ టోక్యో ఒలింపిక్స్లో 400 మీటర్ల హర్డిల్స్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. ఇటీవల పటియాలాలో జరిగిన అంతర్రాష్ట్ర అథ్లెటిక్ చాంపియన్ షిప్లో 49.78 సెకండ్లలో పరుగును పూర్తిచేసి రికార్డుతో పాటు.. స్వర్ణం సాధించాడు. 40 స్థానాల్లోపు ఉన్న వారికి ఒలింపిక్స్ లో పాల్గొనే అర్హత లభిస్తుంది. ప్రస్తుతం జబీర్ ప్రపంచ ర్యాంకింగ్లో 34వ స్థానంలో ఉన్నాడు.
పలు అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో జబీర్ ప్రాతినిధ్యం వహించాడు. జబీర్ పరుగుల రాణిగా పేరొందిన పీటీ ఉష స్వరాష్ట్రమైన కేరళకు చెందినవాడు కావడం విశేషం .
ఇదీ చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీగా దేబ్ కల్యాణ్ మహంతి