ETV Bharat / state

ఆనందపురం జాతీయ రహదారిపై ప్రమాదం.. వ్యక్తి మృతి

author img

By

Published : Apr 10, 2021, 8:27 PM IST

విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారిపై భీమిలి వెళ్లే మార్గం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారుని ఢీకొని కిందపడిన వ్యక్తి పైనుంచి.. లారీ వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

road accident
రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి

విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారి భీమిలి క్రాసింగ్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎమ్. ఈశ్వరరావు(23)అనే వ్యక్తి మరణించాడు. మృతుడు బోయిపాలెంకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ప్రైవేటు కంపెనీలో వెల్డర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఏలా జరిగింది..

బోయిపాలెం నుంచి ఆనందపురానికి ఈశ్వరరావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ముందు వెళ్తున్న కారుని ఢీకొని రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న లారీ.. అతని పైనుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఆటో-ఇన్నోవా ఢీ... ఇద్దరు మృతి

విశాఖ జిల్లా ఆనందపురం జాతీయ రహదారి భీమిలి క్రాసింగ్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎమ్. ఈశ్వరరావు(23)అనే వ్యక్తి మరణించాడు. మృతుడు బోయిపాలెంకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ప్రైవేటు కంపెనీలో వెల్డర్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

ఏలా జరిగింది..

బోయిపాలెం నుంచి ఆనందపురానికి ఈశ్వరరావు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ముందు వెళ్తున్న కారుని ఢీకొని రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న లారీ.. అతని పైనుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఆటో-ఇన్నోవా ఢీ... ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.