పౌరసత్వ చట్ట సవరణ బిల్లు 2019 కు వ్యతిరేకంగా వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరం ప్రెస్క్లబ్లో ముస్లిం, ప్రజా, హక్కుల సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ బిల్లు చట్టమైతే దేశంలోని ముస్లింల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని వక్తలు తెలిపారు. అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయ పోరాటానికి సిద్ధపడతామని ముస్లిం న్యాయవాదులు స్పష్టం చేశారు. దేశ సంపద, స్వాతంత్రోద్యమంలోనూ ప్రముఖ పాత్ర వహించిన భారతీయ ముస్లిం సమాజాన్ని వేరుపరిచే ఈ బిల్లు.. రాజ్యాంగ మూల సూత్రాలకు, సమానత్వ హక్కుకు వ్యతిరేకమని హక్కుల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ఈ బిల్లుపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తోందన్నారు. అనేక అంతర్జాతీయ ఒప్పందాలకు ఈ బిల్లు విరుద్ధమని అభివర్ణించారు.
ఇదీ చూడండి: 'పౌర' బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపు