ETV Bharat / state

పాడేరులో భారీ వర్షం.. పొంగిపొర్లిన వాగులు - నగేపోకో ీోగల లాైే

విశాఖ మన్యం పాడేరులో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. వాగులు వంకలు పొంగాయి. పొంగిన గడ్డల ఉద్ధృతికి ద్విచక్రవాహనాలు చిక్కుకుపోయాయి. వర్షంలోనే గిరిజనులు వాటిని మోసుకొచ్చుకున్నారు. వర్షం కురవడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

vishaka district
ఆకస్మికంగా పాడేరులో భారీ వర్షం
author img

By

Published : Jul 7, 2020, 10:27 PM IST

విశాఖ మన్యం పాడేరులో భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటలు పాటు కురిసిన వర్షానికి గడ్డలు పొంగి ప్రవహించాయి. రహదారులు జలమయమయ్యాయి. పాడేరు, పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల్లో కొండవాగు గడ్డలు ఉద్ధృతంగా ప్రవహించాయి. ముంచంగిపుట్టు మండలం బిరగూడ గెడ్డ ఉద్ధృతికి ద్విచక్రవాహనదారులు ఇరుక్కుపోయారు. సమీప గిరిజనులు కర్రలతో ద్విచక్రవాహనాన్ని మోసుకొచ్చి రహదారి మార్గానికి తీసుకొచ్చారు.

విశాఖ మన్యం పాడేరులో భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటలు పాటు కురిసిన వర్షానికి గడ్డలు పొంగి ప్రవహించాయి. రహదారులు జలమయమయ్యాయి. పాడేరు, పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల్లో కొండవాగు గడ్డలు ఉద్ధృతంగా ప్రవహించాయి. ముంచంగిపుట్టు మండలం బిరగూడ గెడ్డ ఉద్ధృతికి ద్విచక్రవాహనదారులు ఇరుక్కుపోయారు. సమీప గిరిజనులు కర్రలతో ద్విచక్రవాహనాన్ని మోసుకొచ్చి రహదారి మార్గానికి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి గ్యాస్ లీకేజ్ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం: సీపీ ఆర్​.కె మీనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.