ETV Bharat / state

మంత్రి అవంతి అరాచకాలతో ప్రజాస్వామ్యం ఖూనీ: పట్టాభి

author img

By

Published : Feb 27, 2021, 10:13 PM IST

రోజురోజుకూ దిగజారుతున్న ప్రభుత్వ పటిష్టతను కాపాడకోలేక మంత్రి అవంతి రౌడీయిజానికి పాల్పడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి మండిపడ్డారు. అవంతి అరాచకాలతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆక్షేపించారు.

మంత్రి అవంతి అరాచకాలకు ప్రజాస్వామ్యం ఖూనీ
మంత్రి అవంతి అరాచకాలకు ప్రజాస్వామ్యం ఖూనీ

మంత్రి అవంతి శ్రీనివాసరావు అరాచకాలతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని..తెదేపా అధికార ప్రతినిధి కె.పట్టాభి విమర్శించారు. రోజురోజుకూ దిగజారుతున్న ప్రభుత్వ పటిష్టతను కాపాడకోలేక రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. విశాఖ గండిగుండం పంచాయతీలో ఎన్నికల కౌంటింగ్ అవకతవకలపై గ్రామస్తులు చేపట్టిన రిలే నిరహారదీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఓటమి భయం, పిరికితనంతో వైకాపా నేతలు రాత్రిపూట కౌటింగ్ కేంద్రాలలో కరెంటు తీసేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేశ్​కు దక్కాల్సిన విజయాన్ని అక్రమంగా అడ్డుకున్నారన్నారు. ఈ అంశంపై న్యాయ పరంగా ముందుకు వెళతామని.., మంత్రి రౌడీయిజం, బెదిరింపులను ఉపేక్షించేది లేదన్నారు.

ఇదీచదవండి

మంత్రి అవంతి శ్రీనివాసరావు అరాచకాలతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని..తెదేపా అధికార ప్రతినిధి కె.పట్టాభి విమర్శించారు. రోజురోజుకూ దిగజారుతున్న ప్రభుత్వ పటిష్టతను కాపాడకోలేక రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. విశాఖ గండిగుండం పంచాయతీలో ఎన్నికల కౌంటింగ్ అవకతవకలపై గ్రామస్తులు చేపట్టిన రిలే నిరహారదీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఓటమి భయం, పిరికితనంతో వైకాపా నేతలు రాత్రిపూట కౌటింగ్ కేంద్రాలలో కరెంటు తీసేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేశ్​కు దక్కాల్సిన విజయాన్ని అక్రమంగా అడ్డుకున్నారన్నారు. ఈ అంశంపై న్యాయ పరంగా ముందుకు వెళతామని.., మంత్రి రౌడీయిజం, బెదిరింపులను ఉపేక్షించేది లేదన్నారు.

ఇదీచదవండి

'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చీకటి ఒప్పందాలు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.