ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దుల్లో... మావోయిస్టులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. జూన్ 16న కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీనికి నిరసనగా మావోయిస్టు ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఆంధ్రా- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో... విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
AOB BUNDH: ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ - విశాఖపట్నం తాజా వార్తలు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. గతనెల 16న కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద ఎదురు కాల్పుల ఘటనను నిరసిస్తూ మావోయిస్టు ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ గురువారం ఏవోబీ బంద్కు పిలుపునివ్వడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది.
ఆంధ్రా-ఒడిశాలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
ఆంధ్రా - ఒరిస్సా సరిహద్దుల్లో... మావోయిస్టులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. జూన్ 16న కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దీనికి నిరసనగా మావోయిస్టు ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో ఆంధ్రా- ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో... విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.