పరస్పర సహకారం, యుద్ధ నైపుణ్యం మార్పిడి లక్ష్యంగా తూర్పు హిందూ మహా సముద్ర ప్రాంతంలో 4 దేశాల సంయుక్త నౌకా విన్యాసాలు ఆరంభమయ్యాయి. భారత నౌకా దళం నుంచి ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ సాత్పురా నౌకలు, పీ.8.ఐ. హెలికాప్టర్లు ఈ విన్యాసాలలో పాల్గొంటున్నాయి. స్నేహ సంబంధాలు ఉన్న దేశాల నౌకా దళాలతో ఈ రకమైన విన్యాసాలు ఈ ప్రాంతంలో జరగడం ఇదే మొదటిసారి. ఇందులో భారత నౌకాదళం తో పాటు ఫ్రెంచ్, ఆస్ట్రేలియన్, జపాన్, యూఎస్ నేవీ నౌకలు, యుద్ధ విమానాలు హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి.
ఇదీ చదవండి: 'కేసు సీబీఐ చేతిలో ఉందని తెలిసీ జగన్ బాబును విమర్శిస్తున్నారు'