కరోనా వైరస్ బాధితులకు వైద్య సేవలు మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సూర్యనారాయణతో భేటీ అయ్యారు.
నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల పాఠశాలలో కొవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించడానికి వీలుగా.. అవసరమైన వైద్య సిబ్బందిని తక్షణమే నియమించాలని కోరారు. నర్సీపట్నం, పెద్ద బొడ్డేపల్లి, బలిఘట్టం ప్రాంతాల్లో రెండో విడత వ్యాక్సినేషన్ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
ఇదీ చదవండి: