రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా త్వరలోనే ప్రభుత్వ పాఠశాలలు నూతన వసతులతో విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయని.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమా శంకర్ పేర్కొన్నారు. నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అనతికాలంలోనే.. సుమారు 100 నూతన పథకాలు ప్రవేశపెట్టామని ఎమ్మెల్యే వివరించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చేందుకు చేస్తున్న సన్నాహాలు.. తొలివిడత పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: