ETV Bharat / state

గిరిజనులకు పోడు పట్టాలివ్వాలని అటవీశాఖాధికారికి ఎమ్మెల్యే వినతిపత్రం

author img

By

Published : Apr 16, 2021, 9:05 PM IST

అర్హులైన పోడు వ్యవసాయదారులకు పట్టాలు మంజూరు చేయాలని అటవీ అధికారులను నర్సీపట్నం శాసనసభ్యులు ఉమాశంకర్ గణేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సాగుదారులతో కలిసి అటవీశాఖ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

narsipatnam mla
నర్సీపట్నం అటవీ అధికారులకు ఎమ్మెల్యే గణేశ్ వినతిపత్రం అందజేత

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లోని అర్హత గల పోడు వ్యవసాయదారులకు పట్టాలు మంజూరు చేయాలని నర్సీపట్నం అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సాగుదారులతో కలిసి అటవీశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. నర్సీపట్నం డివిజన్​లోని గొలుగొండ, నాతవరం మండలాల్లో అర్హులైనప్పటికీ.. తమకు పట్టాలు మంజూరు చేయలేదని గిరిజనులంతా ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. వారితో కలిసి అటవీశాఖ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే వినతిపత్రాన్ని అందజేశారు. అర్హత కలిగిన వారందరికీ పట్టాలు పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారి జనార్దన్ రావు హామీ ఇచ్చారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లోని అర్హత గల పోడు వ్యవసాయదారులకు పట్టాలు మంజూరు చేయాలని నర్సీపట్నం అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సాగుదారులతో కలిసి అటవీశాఖ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. నర్సీపట్నం డివిజన్​లోని గొలుగొండ, నాతవరం మండలాల్లో అర్హులైనప్పటికీ.. తమకు పట్టాలు మంజూరు చేయలేదని గిరిజనులంతా ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. వారితో కలిసి అటవీశాఖ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే వినతిపత్రాన్ని అందజేశారు. అర్హత కలిగిన వారందరికీ పట్టాలు పంపిణీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారి జనార్దన్ రావు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: పంచాయతీ కార్యదర్శి ఇంట్లో అనిశా సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.