ఉత్తరాంధ్ర జిల్లాలకు ద్రోహం చేసింది మాజీ మంత్రి, తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడని విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. అమరావతి రైతులకు తెదేపా నేతలు ఇస్తున్న మద్దతు హాస్యాస్పదంగా ఉందన్నారు. పోరాటం చేస్తున్నవారు నిజమైన రైతులు కాదని.. వారంతా చంద్రబాబుకు బినామీలుగా ఉన్నవారని ఆరోపించారు. రాజధాని రైతుల పోరాటాలను అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో మరో 20ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి...