ETV Bharat / state

అనారోగ్యంగా ఉన్న ఆవులను స్వీకరించొద్దు: మంత్రి అవంతి

author img

By

Published : Jul 17, 2020, 5:19 PM IST

మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ సింహాద్రి అప్పన్న గోశాలను పరిశీలించారు. భక్తులు కేవలం ఆరోగ్యంగా ఉన్న గోవులను మాత్రమే స్వామికి సమర్పించాలని కోరారు. అనారోగ్యంగా ఉన్న ఆవులను స్వీకరించొద్దని దేవస్థానానికి సూచించారు.

minister avanthi
minister avanthi

విశాఖ సింహాచలం అప్పన్న గోశాలను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు సందర్శించారు. భక్తులు సమర్పించే లేగదూడలు అనారోగ్యంతో ఉంటే అవి చనిపోయే అవకాశం ఉందని.. అటువంటి ఆవులను స్వీకరించ వద్దని దేవస్థానానికి మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తులు ఆరోగ్యంగా ఉన్న గోవులను మాత్రమే స్వామికి సమర్పించాలని కోరారు.

గోశాలలో పనిచేసే గోసంరక్షకులు 31 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాలను పాటించాలని మంత్రి తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు అనవసరమైన వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. దేవునిపై రాజకీయంగా.. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ దేవాలయాలను ఎంతో అభివృద్ధి చేయాలని చూస్తోందన్నారు.

విశాఖ సింహాచలం అప్పన్న గోశాలను రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు సందర్శించారు. భక్తులు సమర్పించే లేగదూడలు అనారోగ్యంతో ఉంటే అవి చనిపోయే అవకాశం ఉందని.. అటువంటి ఆవులను స్వీకరించ వద్దని దేవస్థానానికి మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తులు ఆరోగ్యంగా ఉన్న గోవులను మాత్రమే స్వామికి సమర్పించాలని కోరారు.

గోశాలలో పనిచేసే గోసంరక్షకులు 31 మందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆదేశాలను పాటించాలని మంత్రి తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు అనవసరమైన వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. దేవునిపై రాజకీయంగా.. తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హిందూ దేవాలయాలను ఎంతో అభివృద్ధి చేయాలని చూస్తోందన్నారు.

ఇదీ చదవండి: మాస్క్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.