ETV Bharat / state

current shock: సెజ్​లో విద్యుదాఘాతం.. కార్మికుడు మృతి - vizag SEZ

విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలి-సెజ్​(SEZ)లో విద్యుదాఘాతానికి(current shock) గురై ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై మృతుడి బంధువులు ఆందోళన చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు(police) ఆందోళనకారులకు నచ్చజెప్పారు.

సెజ్​లో విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
సెజ్​లో విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
author img

By

Published : Jul 14, 2021, 5:57 PM IST

విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్​లో.. రసూల్ డెకర్ పరిశ్రమలో మునగపాక మండల ఉమ్మలాడ గ్రామానికి చెందిన రాము ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రాము మృతి చెందాడని ఆరోపించారు.

మృతుడి కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. యలమంచిలి సీఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు.

విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలోని సెజ్​లో.. రసూల్ డెకర్ పరిశ్రమలో మునగపాక మండల ఉమ్మలాడ గ్రామానికి చెందిన రాము ఒప్పంద కార్మికుడిగా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే రాము మృతి చెందాడని ఆరోపించారు.

మృతుడి కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. యలమంచిలి సీఐ వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబీకులతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలిపారు.

ఇదీచదవండి.

దళారుల ముసుగులో.. వైకాపా నేతలే రైతుల్ని దోచుకుంటున్నారు: అచ్చెన్నాయుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.