ETV Bharat / state

విషాదం: కరోనాతో ఒకే కుటుంబలో ముగ్గురు మృతి

author img

By

Published : May 18, 2021, 11:00 PM IST

కరోనా మహమ్మారి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఒకే కుటుంబంలో ముగ్గురుని వైరస్ బలిగొన్న ఘటన విశాఖ జిల్లా టి. సిరసపల్లి గ్రామంలో నెలకొంది.

Three members died with Corona in Visakhapatnam
Three members died with Corona in Visakhapatnam

విశాఖ జిల్లా మునగపాక మండలం టి. సిరసపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ముగ్గురుని కరోనా మహమ్మారి పొట్టన బెట్టుకుంది. గ్రామానికి చెందిన పొలమర శెట్టి చిన్నమ్మడు(75) కి కరోనా సోకడంతో ఐదురోజుల క్రితం మృతి చెందింది. అనంతరం మృతురాలి అల్లుడు, కూతురు.. మళ్ల త్రినాథరావు(52), నూకరత్నం కొవిడ్ బారినపడ్డారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అతను మృతి చెందరగా.. ఇవాళ ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

ఇవీ చదవండి:

విశాఖ జిల్లా మునగపాక మండలం టి. సిరసపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో ముగ్గురుని కరోనా మహమ్మారి పొట్టన బెట్టుకుంది. గ్రామానికి చెందిన పొలమర శెట్టి చిన్నమ్మడు(75) కి కరోనా సోకడంతో ఐదురోజుల క్రితం మృతి చెందింది. అనంతరం మృతురాలి అల్లుడు, కూతురు.. మళ్ల త్రినాథరావు(52), నూకరత్నం కొవిడ్ బారినపడ్డారు. అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అతను మృతి చెందరగా.. ఇవాళ ఆమె మృతి చెందింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

ఇవీ చదవండి:

రాష్ట్రానికి మరో 84 వేల కొవిషీల్డ్ టీకా డోసులు

బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్: రాష్ట్రంలో 4 మరణాలు.. వందలాది కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.